Monday 16th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బాల రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఎంతమంది వచ్చారంటే

బాల రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఎంతమంది వచ్చారంటే

Ayodhya Ram Mandir on Jan 1st | నూతన సంవత్సర వేడుకల వేళ అయోధ్య రామ మందిరం భక్తులతో కిక్కిరిసి పోయింది. జనవరి 1న బాల రాముడి దర్శనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. బుధవారం ఒక్క రోజులోనే 2 లక్షలకు పైగా భక్తులు అయోధ్య రామాలయాన్ని సందర్శించారు.


ఆయోధ్యలోని రామాలయం ప్రాంగణం అంతా భక్తులతో నిండి పోయింది. రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఏర్పడ్డాయి. ఉదయం 3 గంటల నుంచే భక్తులు ఆలయాన్ని చేరుకున్నారు. బుధవారం కేవలం 15 నిమిషాలు మాత్రమే గుడి మూసివేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.


స్థానిక హోటళ్లు, ధర్మశాలలు ముందుగానే నిండిపోయినట్లు అయోధ్య రామందిన ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

You may also like
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!
జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!
Iran warship hit by USA
WW-II తర్వాత అతిపెద్ద దాడి.. విశాఖ నుంచి వెళ్తున్న ఇరాన్ నౌకపై..

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions