Sunday 1st June 2025
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్ ఘన విజయానికి నేటితో ఏడాది

కాంగ్రెస్ ఘన విజయానికి నేటితో ఏడాది

One Year For Congress Victory In Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయానికి డిసెంబర్ మూడు ( Dec 3 )తో సరిగ్గా ఏడాది అయ్యింది.

గతేడాది నవంబర్ 30న ఒకే విడతలో రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ఎన్నికలు జరిగాయి. అనంతరం డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) 64 స్థానాల్లో, మిత్రపక్షం సీపీఐ ( CPI ) ఒకచోట గెలిచాయి.

మరోవైపు సుమారు దశాబ్దం అధికారంలో కొనసాగిన గులాబీ పార్టీ కేవలం 39 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. బీజేపీ ( BJP ) 8 చోట్ల, ఎంఐఎం ( AIMIM ) ఏడింట్లో విజయాన్ని సాధించాయి.

రేవంత్ రెడ్డి కొడంగల్ ( Kodangal ) నుండి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) గజ్వెల్ నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దర్ని కామారెడ్డిలో ఓడించిన వెంకటరమణ రెడ్డి ( K.V. Ramana Reddy ) పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions