Wednesday 18th March 2026
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్ ఘన విజయానికి నేటితో ఏడాది

కాంగ్రెస్ ఘన విజయానికి నేటితో ఏడాది

One Year For Congress Victory In Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయానికి డిసెంబర్ మూడు ( Dec 3 )తో సరిగ్గా ఏడాది అయ్యింది.

గతేడాది నవంబర్ 30న ఒకే విడతలో రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ఎన్నికలు జరిగాయి. అనంతరం డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) 64 స్థానాల్లో, మిత్రపక్షం సీపీఐ ( CPI ) ఒకచోట గెలిచాయి.

మరోవైపు సుమారు దశాబ్దం అధికారంలో కొనసాగిన గులాబీ పార్టీ కేవలం 39 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. బీజేపీ ( BJP ) 8 చోట్ల, ఎంఐఎం ( AIMIM ) ఏడింట్లో విజయాన్ని సాధించాయి.

రేవంత్ రెడ్డి కొడంగల్ ( Kodangal ) నుండి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) గజ్వెల్ నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దర్ని కామారెడ్డిలో ఓడించిన వెంకటరమణ రెడ్డి ( K.V. Ramana Reddy ) పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions