Monday 12th May 2025
12:07:03 PM
Home > తాజా > నిర్మాణాలు తొలగించండి..బీఆరెస్ ఎమ్మెల్యే కాలేజీలకు నోటీసులు

నిర్మాణాలు తొలగించండి..బీఆరెస్ ఎమ్మెల్యే కాలేజీలకు నోటీసులు

Notices Issued To Marri Rajashekar Reddy Colleges | హైదరాబాద్ ( Hyderabad ) లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ( HYDRA ) ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు.

ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ( Malkajgiri ) ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ( Mallareddy ) అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ( Marri Rajashekar Reddy )కి చెందిన కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.

దుండిగల్ ( Dundigal ) లోని ఎంఎల్ఆర్ఐటీ ( MLRIT ) కాలేజీకి మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీకి నోటీసులు వెళ్లాయి. చిన్న దామెరచెరువు ఎఫ్టీఎల్ ( FTL ), బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువు భూమిని ఆక్రమించినట్లు నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏడు రోజుల్లో నిర్మాణాలను తొలగించాలని లేదంటే తామే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు.

చెరువు భూముల్లో బిల్డింగ్స్, షెడ్స్,వెహికల్ పార్కింగ్ తో పాటు రోడ్లు కూడా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

You may also like
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!
cm revanth meets jana reddy
జానా రెడ్డితో సీఎం రేవంత్ భేటి.. కారణం ఏంటంటే!
Metro
మహిళా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్!
telangana high court
దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions