Thursday 19th March 2026
12:07:03 PM
Home > తాజా > నిర్మాణాలు తొలగించండి..బీఆరెస్ ఎమ్మెల్యే కాలేజీలకు నోటీసులు

నిర్మాణాలు తొలగించండి..బీఆరెస్ ఎమ్మెల్యే కాలేజీలకు నోటీసులు

Notices Issued To Marri Rajashekar Reddy Colleges | హైదరాబాద్ ( Hyderabad ) లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ( HYDRA ) ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు.

ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ( Malkajgiri ) ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ( Mallareddy ) అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ( Marri Rajashekar Reddy )కి చెందిన కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.

దుండిగల్ ( Dundigal ) లోని ఎంఎల్ఆర్ఐటీ ( MLRIT ) కాలేజీకి మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీకి నోటీసులు వెళ్లాయి. చిన్న దామెరచెరువు ఎఫ్టీఎల్ ( FTL ), బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువు భూమిని ఆక్రమించినట్లు నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏడు రోజుల్లో నిర్మాణాలను తొలగించాలని లేదంటే తామే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు.

చెరువు భూముల్లో బిల్డింగ్స్, షెడ్స్,వెహికల్ పార్కింగ్ తో పాటు రోడ్లు కూడా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

You may also like
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!
vc sajjanar
బలవంతంగా రంగులు పూస్తే.. సజ్జనర్ వార్నింగ్
vc sajjanar
పెళ్లి పేరుతో మోసాలు.. అమ్మాయిలూ.. బీ కేర్‌ఫుల్: సీపీ సజ్జనర్!
Fire breaks out at Aditya Enclave
HYD- అమీర్ పేట్ లో అగ్ని ప్రమాదం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions