Saturday 7th June 2025
12:07:03 PM
Home > తెలంగాణ > హామీలు అమలు చేసేంత వరకు వదిలేది లేదు. వెంటాడుతాం. పోరాడుతాం

హామీలు అమలు చేసేంత వరకు వదిలేది లేదు. వెంటాడుతాం. పోరాడుతాం

Nothing is left until the promises are fulfilled. Let's chase. Let's fight

-ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. ఇది చిన్న విరామం మాత్రమే.. ఆ తర్వాత రెట్టించిన వేగంతో ముందుకు వెళ్తాం
-అబద్దపు ప్రచారాలతో ప్రజలు అయోమయానికి గురి చేశారు. రెండు శాతం ఓట్ల తేడాతోనే కాంగ్రెస్‌ గద్దెనెక్కింది
-ప్రాణాలొడ్డి తెచ్చుకున్న తెలంగాణను.. దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిపాడు కేసీఆర్‌
-అదే ఉద్యమపంథాను కొనసాగిద్దాం.. ప్రతిపక్ష పాత్రను పోషించి ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేద్దాం
-అధర్మం, మోసంతోటి గెలిచిన పార్టీ ఎక్కువ రోజులు మనజాలదు.. ధర్మమే గెలుస్తుంది.. మనమే నిలబడతాం..
-బాల్కొండ బీఆరెస్‌ నాయకులు, కార్యకర్తలతో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి..

వేల్పూర్‌:ఎన్నో అబద్దపు హామీలతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు అయోమయానికి గురి చేసి గద్దెనెక్కిందని, హామీల అమలుకు శుక్రవారం నుంచే కౌంట్‌డౌన్‌ షురూ అయ్యిందన్నాని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలన్నీ మార్చి ఏడో తారీఖు వరకు నెరవేర్చాలని, లేదంటే వెంటాడుతామని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారాయన. గురువారం ఎమ్మెల్యేగా మూడవ సారి ఎన్నికైన తర్వాత మొదటి సారి నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా వేల్పూర్‌ రోడ్‌ వద్ద కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.. తండ్రి స్వర్గీయ వేముల సురేందర్‌ రెడ్డి గారి విగ్రహానికి పూలమలతో నివాళి అర్పించి తదనంతరం కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వేల్పూర్‌ బయలుదేరారు.వేల్పూర్‌లోని తన నివాసంలో తనను కలిసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన బీఆరెస్‌ కార్యకర్తలు, నాయకులు, ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని పదిహేను సంవత్సరాల పాటు సుధీర్ఘ పోరాటం చేసి తీసుకొచ్చిన పార్టీ మనది. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దేశ రాజకీయాలను ఒప్పించి రాజకీయ అనివార్యత సృష్టించి తెలంగాణకు ఒప్పుకోకపోతే మాకు నూకలు చెల్లవు అని చెప్పి అటు కాంగ్రెస్‌, ఇటు టీడీపీ ఇద్దరినీ కూడా రాజకీయ అనివార్యత సృష్టించి తెలంగాణకు ఒప్పించిన నాయకుడు కేసీఆర్‌..’అని పేర్కొన్నారను. ‘అలా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలబెట్టారు. డెబ్బై లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు అతికష్టంగా పండే మన తెలంగాణలో ఈరోజు మూడు కోట్ల మెట్రిక్‌ టన్నుల వడ్లు పండిరచే స్థాయికి తెలంగాణు కేసీఆర్‌ తీసుకుపోయాడు. ఏ ఊరు చేసినా, ఏ గల్లీ చూసినా అనేక మార్పులు.. యాభై ఏండ్లలో చేయని అభివృద్దిని తొమ్మిదిన్నర ఏండ్లలో చేసి చూపిన నాయకుడు కేసీఆర్‌’అని అన్నారు. ‘కరెంటు కోసం కష్టాలు పడ్డ మనకు 24 గంటల కరెంటు ఇచ్చాడు.. చెరువులను గంగాళంలా మార్చి బోర్లలో నీళ్లు తెచ్చింది కేసీఆర్‌. రైతు ప్రతీ సీజన్‌లో మందు సంచులు, విత్తనాలు కొనాలన్నా సావుకారుల వద్దకు బాకీల కోసం తిరిగే రైతులకు ఇవాళ ఆ అవసరం రాకుండా ప్రభుత్వమే రైతుకు ఎకరాకు పదివేల పెట్టుబడి ఇచ్చే విధానాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది కేసీఆర్‌.’ అని గుర్తు చేశారు వేముల. పేదలకు రెండు వందల పింఛన్‌ను రెండువేలకు పెంచి ఇచ్చాడని, దేశంలో ఎక్కడా ఇది లేదన్నారు. ఆడబిడ్డ పెండ్లయితే.. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష రూపాయల కల్యాణలక్ష్మీ చెక్కులందించాడన్నారు. సొంత ఇంటిలా పట్టించుకుని రాష్ట్రాన్ని కేసీఆర్‌ కాపాడుకున్నాడని, కాంగ్రెస్‌ పార్టీ అబద్దపు ప్రచారాలు, రెండు సార్లు వేసిండ్రు కదా ఒక్కసారి మాకేయిండ్రు అని సింపతి కొట్టేడయంతో పాటు కేసీఆర్‌ మీద, తననామీద, తన కుటుంబం మీద అసత్యపు ఆరోపణలు.. చెప్పిందే వంద సార్లు అబద్దాలు చెప్పి ప్రజలు అయోమయానికి గురిచేశారన్నారు. ‘అలవికాని హామీలు చాలా ఇచ్చారు. దానికి కూడా ప్రజలు కొంతమంది అవునేమో అవుతదేమో చూద్దాం అనే భ్రమలో పడిపోయి రాష్ట్ర స్థాయిలో వారికి ఓట్లేశారు. రెండు శాతమే రెండు పార్టీలకు తేడా. రెండు శాతం తేడాతో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది’నా అని అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాక ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉందని, ఎవరు కుంగిపోవనవసరం లేదన్నారు. ‘పదివేల రైతుబందు ఇస్తుంటే పదిహేను వేలిస్తామన్నారు. ఇప్పుడు సీజన్‌ స్టార్ట్‌ అవుతున్నది. చూద్దాం..ప్రతిపక్ష పార్టీ, నాయకులుగా మనమం దరం కూడా ఏం చేస్తరో చూద్దాం. చేయకపోతే వెంటపడి చేపించాల్సిన బాధ్యత కూడా మనదే. రెండు లక్షల రుణమాఫీ అన్నరు. మూడు నెలలనే చేస్తామన్నారు. రేపటి నుంచి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌. తొంభై రోజు ల్లో.. మార్చి ఏడో తారీఖులోపల రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయాల్సిందే. కౌలు రైతుల కు కూడా చేస్తామన్నారు.’అని గుర్తు చేశారు. వరికే కాదు వాళ్ల హామీలో అన్ని పంటలకు బోనస్‌ ఇస్తా మని హామీలిచ్చారని, పసుపుకు పన్నెండు వేల మద్దతు ధర ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఎర్రజొన్నకు కూడా రేటు 3500 ఇప్పిస్తామన్నారు. పన్నెండు వేలు పసుపుకు , వరికి ఐదొందల బోనస్‌. ఇవ్వకపోతే వెంటపడి ఇప్పించాలి. ప్రతిపక్ష నాయకుడిగా రైతులు, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసి చెప్పిన ధరను ఇచ్చేదాక వెంటపడాలె. మహిళలకు కూడా బస్సు ఫ్రీ అన్నరు. కరెంటు బిల్లు కూడా కాంగ్రెసే కడతదన్నారు. లక్ష కల్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం, సిలిండర్‌ ఐదొందలన్నారు. రేపటి నుంచే అమలు చేస్తామన్నారు’ అని గుర్తు చేశారు. ప్రతీ మహిళకు రెండు వేల ఐదొందలు ఇస్తామ న్నారన్నారు. ‘హమీలు ఇస్తే సహకారం, ఎగ్గొడితే పోరాటం. 2001 నుంచి 2014 దాక పోరాటం చేసిన రక్తం ఇది. ఎవరికీ భయపడే రక్తం కాదిది..’ అని అన్నారు. ‘ఏ గ్రామానికి పోయినా మీరు తలెత్తుకుని నిలబడి మాట్లాడే విధంగా కేసీఆర్‌ అభివృద్ధి చేసి చూపాడు. ఎవరికీ తలిదించాల్సిన పనిలేదు. ధైర్యంగా ఉండాలె. ఒక వాచ్‌డాగ్‌లా ఉండాలి. కాంగ్రెస్‌ మితిమీరిన వేశాలేస్తే ప్రజలకు అర్థం అవుతుంది. ప్రజలు వెయిట్‌ చేస్తున్నారు ఎప్పుడు రుణమాఫీ అవుతుందా అని పదిహేను వేల రైతులు, నాలుగు వేల పింఛన్లు కోసం వెయిట్‌ చేస్తున్నారు.’అని అన్నారు. ‘ఇది కొంచెం విరామం, స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమే. ఇంతకు రెట్టింపు వేగంతో వెళ్తాము. హామీలు జరుగుతున్నవా లేదా చర్చకు పెట్టాలె ప్రజల్లో. యాక్టివ్‌గా ఉండాలి. ఏమీ కాదు. అధర్మంతోటి మోసంతోటి అన్యాయంతోటి ఓట్లు వేయించుకున్నోళ్లు ఎక్కువ కాలం ఉండరు, కొద్ది రోజులు వెయిట్‌ చేయాలె.’ అని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు వేముల…

You may also like
TG సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి నెలకు రెండుసార్లు..!
chenab railway bridge
ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ!
pawan kalyan
‘ఆరోజు సంక్రాంతి – ‌దీపావళి కలిపి జరుపుకోండి’
kavlakuntla kavitha news office
తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్ ప్రారంభించిన కవిత!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions