Nagarjuna Appears In Nampally Court | మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) ఆరోపణల నేపథ్యంలో నటుడు అక్కినేని నాగార్జున ( Nagarjuna ) నాంపల్లి కోర్టు ( Nampally Court )లో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.
పిటిషన్ నేపథ్యంలో తన వాంగ్మూలం ఇచ్చేందుకు సతీమణి అమల ( Amala ), కుమారుడు నాగ చైతన్య ( Naga Chaitanya )తో కలిసి కోర్టు ఎదుట నాగార్జున హాజరయ్యారు.
తన కుటుంబంతో పాటు చైతన్య సమంత ( Samantha ) విడాకులపై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగార్జున తెలిపారు. కొండా సురేఖ వ్యాఖ్యల మూలంగా తన కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని వాంగ్మూలం ఇచ్చారు.
రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును నాగార్జున కోరారు. నాగ చైతన్య సమంత విడాకులు కేటీఆర్ వల్లే అంటూ మంత్రి కొండా సురేఖ అసభ్యకరంగా మాట్లాడారని పేర్కొన్నారు.










