Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలి’

‘ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలి’

MLC Kavitha News Latest | ఆంధ్రప్రదేశ్ లో కలిపిన గ్రామాల్లో ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

ఈ మేరకు హైదరాబాద్ లో ఆమె ‘పోలవరం, తెలంగాణపై జల ఖడ్గం’ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..జూన్ 25న ప్రధాని మోదీ ‘ప్రగతి ఎజెండా’ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారని, ఇందులో పోలవరంతో పాటు అనేక విషయాలపై చర్చించనున్నారని పేర్కొన్నారు.

ఈ మీటింగ్ లో ప్రధాని ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణ తిరిగి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. పురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈ నేపథ్యంలో ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కవిత సూచించారు.

You may also like
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions