Microsoft CEO Satya Nadella hails India vs England Oval Test thriller | అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ 2-2 తో డ్రాగా ముగిసింది.
చివరి టెస్టు చివరి రోజు ఆటలో భారత ఆటగాళ్లు ప్రత్యేకంగా మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన చేయడంతో కేవలం ఆరు పరుగుల తేడాతో భారత్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిరీస్ సమం అవ్వడంతో ఇరు జట్ల కెప్టెన్లు బెన్ స్టోక్స్, శుభమన్ గిల్ సంయుక్తంగా ట్రోఫీని అందుకున్నారు.
ఈ క్రమంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. ’25 రోజులు. 5 సమరాలు. 2-2తో సమం. ఇది కేవలం ఆట కాదు. ఇది టెస్ట్ క్రికెట్, దాని శాశ్వతమైన వైభవానికి ప్రతీక. ఒక అద్భుతమైన సిరీస్. డ్రామా, ధైర్యం, మరియు గొప్పతనం ప్రదర్శించిన భారత్-ఇంగ్లాండ్ జట్లకు హాట్స్ ఆఫ్’ అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
కాగా ఈ టెస్టు సిరీస్ జరిగిన తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. టెస్టు ఫార్మాట్ కు ఆదరణ తగ్గుతున్న సమయంలో ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచులు తిరిగి ఈ ఫార్మాట్ ను అగ్ర స్థానంలో నిలిపేందుకు దోహద పడుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.










