- ఇంటి రుణం తీర్చలేని మహిళకు ఆర్థిక సాయం!
LuLu Group Chairman | లూలూ గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ (MA Yusuff Ali) తన గొప్ప మనసు చాటుకున్నారు. ఉదారతను ప్రదర్శించి ఓ మహిళకు, ఆమె పిల్లలకు సాయం చేశారు. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో సంధ్య, ఆమె భర్త ఉత్తర పరవూరులో 2019లో ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.4 లక్షల రుణం తీసుకున్నారు. అయితే, ఆమె భర్త 2021లో కుటుంబాన్ని విడిచిపెట్టడంతో రుణం చెల్లించడం లేదు. వడ్డీతో సహా రుణ మొత్తం దాదాపు రూ. 8 లక్షలకు పెరిగింది.
నెలకు దాదాపు రూ.9 వేల ఆదాయం వచ్చే దుకాణంలో పనిచేస్తున్న సంధ్య రెండేళ్లుగా అప్పు తీర్చే పరిస్థితి లేదు.దీంతో ఒక రోజు, ఆ ఫైనాన్స్ సంస్థ సంధ్య ఇంటిని స్వాధీనం చేసుకుని ఇంట్లోకి ప్రవేశించకుండా నిషేధించింది. ఆమె మరియు ఆమె పిల్లలు రోడ్డున పడ్డారు. ఈ వార్త లూలూ గ్రూప్ చైర్మన్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించి లోన్ మొత్తం చెల్లించాలని తన కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. అంతే కాకుండా సంధ్య కుటుంబానికి మరో 10 లక్షల రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయించారు.