Monday 12th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌

Lalu Prasad Yadav visited Tirumala Srivara

-ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌
-శనివారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారు.

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ శనివారం తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారు. రాత్రి తిరుమలకు కుటుంబ సభ్యులకు కలిసి చేరుకున్న ఆయన శనివారి తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ మర్యాదల ప్రకారం టీటీడీ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. లాలు ప్రసాద్‌ యాదవ్‌ వెంట ఆయన మాజీ ముఖ్యమంత్రి రబ్రిదేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌, కుటుంబ సభ్యులు శ్రీవారి దర్శనంలో పాల్గొన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions