Krish Jagarlamudi Latest | ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘ హరిహర వీరమల్లు’. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ కొంతభాగం తెరకెక్కించిన అనంతరం ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశారు.
దీనిపై తాజగా ఆయన వివరణ ఇచ్చారు. అనుష్క, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి ‘ఘాటి’ సినిమాను తెరక్కించారు. ఇది సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ఓ విలేకరు హరిహర వీరమల్లు నుంచి ఎందుకు బయటకు వచ్చేశారు అని క్రిష్ ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన దర్శకుడు కోవిడ్, వ్యక్తిగత కారణాల మూలంగా షెడ్యూల్ లో మార్పులు వచ్చాయని, ఈ క్రమంలోనే ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చినట్లు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమని, అలాగే నిర్మాత ఏ.ఎం. రత్నం అంటే గౌరవం ఉందని పేర్కొన్నారు.









