Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘ప్రభల తీర్థం..ఏకాదశ రుద్రుల సమావేశం’

‘ప్రభల తీర్థం..ఏకాదశ రుద్రుల సమావేశం’

Konaseema Prabhala Theertham | డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభల తీర్థం కన్నుల పండుగగా జరుగుతోంది. అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ఏటా కనుమ పండుగ రోజు జరిగే ప్రభల తీర్ధానికి 476 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర ఉంది. ఈ తీర్థం జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచింది. ఏకాదశ రుద్రులు 11 గ్రామాల నుంచి బయలుదేరి జగ్గన్నతోటలో కొలువుదీరి, ప్రజాక్షేమం కోసం చర్చించుకుంటారని భక్తుల విశ్వాసం. కాగా ప్రభల తీర్థం నేపథ్యంలో భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

476 సంవత్సరాలుగా ఎంతో ప్రశస్తమైన జగ్గన్నతోట ప్రభల తీర్ధానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ‌ హోదా కల్పించిందన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రభల తీర్థం సమయంలో లోక కళ్యాణార్థమై ఏకాదశ రుద్రులు ఇక్కడ సమావేశమవుతారని అందరి విశ్వాసం అని పేర్కొన్నారు. దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే ఈ వేడుకకు రాష్ట్ర పండుగ హోదా కల్పించడం ద్వారా ప్రభుత్వ పరంగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు. ఉత్సవం వైభవంగా జరగాలని, అందరికీ మంచి జరగాలని ముఖ్యమంత్రి ప్రార్ధించారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions