Saturday 21st March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ కళ్యాణ్ కోర్టుకు రావాలి.. షాకిచ్చిన హైదరాబాద్ సిటీ కోర్టు

పవన్ కళ్యాణ్ కోర్టుకు రావాలి.. షాకిచ్చిన హైదరాబాద్ సిటీ కోర్టు

Hyderabad City Civil Court On Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) కు ఊహించని షాక్ ఎదురైంది. తిరుమల లడ్డూ ( Tirumala Laddoo ) లో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో తిరుమల లడ్డూపై పవన్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది రామారావు హైదరాబాద్ సిటీ కోర్టు ( Hyderabad City Civil Court )లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరిలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా, ఏపీ ప్రభుత్వం తిరుమల లడ్డులను పంపించిన విషయం తెల్సిందే.

అయితే అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా జంతు కొవ్వును వాడారని డిప్యూటీ సీఎం పవన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలు దెబ్బతీశేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నారు.

సదరు వీడియోలను సోషల్ మీడియా ( Social Media ) నుండి తొలగించాలని కోరారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ తో పాటు తెలంగాణ సీఎస్ శాంతికుమారి ( CS Shantikumari )కి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions