Sunday 8th September 2024
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ ఎన్నికల్లో తొలి ఓటు నమోదు.. వేసింది ఎవరంటే..!

తెలంగాణ ఎన్నికల్లో తొలి ఓటు నమోదు.. వేసింది ఎవరంటే..!

telangana elections

Telangana Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సంబంధించి తొలి ఓటు నమోదయింది. నవంబర్ 30న జరగనున్న ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం.

పోలింగ్ బూత్ కు రాలేని వృద్ధులు, వికలాంగులకు ఓట్ ఫ్రమ్ హోమ్ అనే సదుపాయాన్ని కల్పించింది. ఇందులో భాగంగా ఇంటి నుండి ఓటు ప్రక్రియ ప్రారంభం అయింది.

ఇందులో భాగంగా నవంబర్ 21న ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన 91 ఏండ్ల అన్నపూర్ణ చండూరి తన ఇంటి వద్ద నుండే ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎన్నికల అధికారులు, పోలీసులు పోస్టల్ బ్యాలెట్ ను ఆమె ఇంటికి తీసుకెళ్లారు. కాగా ఇంటి నుండి ఓటు వేసే సదుపాయాన్ని వినియోగించుకోవడానికి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన ఐదు రోజుల్లో ఫారం 12-డిని ఉపయోగించి రిటర్నింగ్ అధికారి కి దరఖాస్తును సమర్పించారు.

మొత్తం 28 వేల 57 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుండి ఓటు హక్కు ను ఉపయోగించుకొనున్నారు. కాగా తెలంగాణ ఎన్నికల్లో తొలి ఓటు వేయడం ద్వారా అన్నపూర్ణ చండూరి వార్తల్లో నిలిచారు.

You may also like
సీఎం రేవంత్ సంచలన నిర్ణయం ?..ఆ సినిమాపై నిషేధం ?
husband second marriage
భర్తకి రెండో పెళ్లి చేసిన భార్య.. కారణమేంటంటే!
CM Revanth reddy
మిలియ‌న్ మార్చ్ త‌ర‌హాలో ఆ వేడుక నిర్వహిద్దాం: సీఎం రేవంత్
cm revath reddy
32 ఎకరాల్లో ఉస్మానియా హాస్పిటల్ కి కొత్త భవనం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions