Sunday 8th June 2025
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ పై ఈడీ కేసు నమోదయ్యింది: ఎంపీ రఘునందన్

కేసీఆర్ పై ఈడీ కేసు నమోదయ్యింది: ఎంపీ రఘునందన్

raghunandan rao

ED Case On KCR | మెదక్ ఎంపీ, బీజేపీ నాయకులు రఘునందన్ రావు (Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, బీఆరెస్ అధినేత కేసీఆర్ (KCR)పై ఈడీ కేసు నమోదయ్యిందని చెప్పారు.

ఈ మేరకు గురువారం మెదక్ లో  మాట్లాడుతూ కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని ఆయన తెలిపారు. కేసీఆర్ కు, మాజీ మంత్రి హరీష్ రావుకు, బీఆరెస్ నేత వెంకట్రామిరెడ్డికు ముందుంది ముసళ్ళ పండుగ అంటూ హెచ్చరించారు.

దుబ్బాకలో తనను ఓడించానని హరీష్ రావు (Harish Rao) విర్రవీగారని, కానీ ఆయన ఉన్న మీటింగ్ లో ఎస్కార్ట్ లో మరొకరు వస్తారని హరీష్ ఊహించలేదన్నారు.

బహిరంగంగా పైసలు, మద్యం పంచినవారు ఓడిపోయారని ఎద్దేవా చేశారు. వెంకట్రామిరెడ్డి రూ.1000 కోట్లు ఖర్చు చేసినా, లెక్క చేయకుండా ప్రజలు తనను గెలిపించారని వ్యాఖ్యానించారు.

You may also like
vivek venkata swamy
‘వివేక్ వెంకటస్వామి అనే నేను..’ మంత్రి గడ్డం వివేక్ ప్రస్థానమిదే!
adluri laxman kumar
ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి!
ministers
తెలంగాణలో కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే!
TG సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి నెలకు రెండుసార్లు..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions