Chiranjeevi Launches ‘Rudra’ Book | తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ (Konda Murali) దంపతుల కుమార్తె కొండా సుష్మిత (Konda Susmitha) ‘రుద్ర’ అనే పుస్తకాన్ని (Rudra Book) రచించారు.
శివపురాణంలోని విశేషాలను వారికి నేటి యువతకు సులభంగా తెలియజేయాలనే సంకల్పంతో ఈ పుస్తకాన్ని సుష్మిత ఈ పుస్తకాన్ని రచించారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ విషయాన్ని మంత్రి కొండా సురేఖ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఆధ్యాత్మిక విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని యువతకు చేరువ చేసేలా ఈ పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమని కొనియాడారు. నేటి తరానికి ఇటువంటి విలువైన పుస్తకాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. రచయిత్రి సుస్మిత పటేల్ ప్రయత్నాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
‘కొండా సుష్మిత చిన్న వయసులోనే శివ పురాణానికి సంబంధించిన రుద్ర అనే పేరుతో చక్కటి పుస్తకం రాసింది. నేటి జనరేషన్కు మన పురాణాలేంటి..? శివుడు, పార్వతి అపూర్వమైన కలయిక గురించి, లోక కల్యాణం గురించి పుస్తకంలో చాలా చక్కగా వివరించింది. ఇలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి పుస్తకం రాయటం గొప్ప విషయం. ఇలాంటి పుస్తకాలు మరెన్నో రాయాలని.. అమ్మా నాన్నలకు పేరు తెచ్చే విధంగా మంచి రచయితగా మారాలి’ అని చిరంజీవి ఆశీర్వదించారు.










