Wednesday 9th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దేశంలో జనగణన గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్!

దేశంలో జనగణన గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్!

population

Population Census | దేశవ్యాప్తంగా జనగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగగణనకు సంబంధించి కేంద్ర హోం శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం రెండు విడతల్లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించనున్నట్లు గెజిట్ లో పేర్కొంది. 2026 అక్టోబర్ 1 నాటికి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్ లో జనగణన పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. 2027 మార్చి 1 నాటికి మిగిలిన రాష్ట్రాల్లో జన గణన పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. జనగణనతో పాటు కులగణన వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం సేకరించనుంది.

ఈ జనగణన ప్రతి వ్యక్తికి సంబంధించిన సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక, ఇతర వివరాలు సేకరిస్తారు. ఇందులో కులగణన కూడా నిర్వహించనున్నారు. ఈసారి జనాభా గణన డిజిటల్ పద్ధతిలో మొబైల్ అప్లికేషన్ల ద్వారా నిర్వహించనున్నారు.

ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ భారీ ప్రక్రియ కోసం సుమారు 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు 1.3 లక్షల మంది ఇతర సిబ్బంది పాల్గొననున్నారు. ఈ జనాభా గణన ప్రక్రియకు రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది దేశంలో 16వ జనగణన. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరుపుతున్న 8వ జనాభా గణన.

You may also like
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!
hilsa fish
దేవీ నవరాత్రులు.. బంగ్లాదేశ్ నుంచి 3వేల టన్నుల హిల్సా చేపలు!
mamata banerjee
‘ఇండి’ కూటమికి బిగ్ షాక్.. బెంగాల్ సీఎం కీలక ప్రకటన!
Corona cases are increasing again in India
ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions