KCR Bus Tour | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆరెస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయనున్నారు. ఏప్రిల్ 24 నుండి 17 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.
బుధవారం మిర్యాలగూడ నుండి బస్సు యాత్ర మొదలవనుండగా, మే10 సిద్దిపేట లో బహిరంగ సభ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ యాత్ర చేయనున్న బస్సుకు మంగళవారం తెలంగాణ భవన్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఎంపీ సీట్లను గెలవాలనే లక్ష్యంతో కేసీఆర్ (KCR) ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రోడ్ షో మరియు సభలకు కేసీఆర్ పాల్గొననున్నారు.