Wednesday 4th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తెలంగాణ విద్యావ్యవస్థ అధ్వానంగా ఉంది….మంత్రి సంచలన వ్యాఖ్యలు…!

తెలంగాణ విద్యావ్యవస్థ అధ్వానంగా ఉంది….మంత్రి సంచలన వ్యాఖ్యలు…!

Ap minister controversial comments on telangana

తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ అద్భుతంగా ఉందని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటున్న తరుణంలో తెలంగాణ లోని విద్యావ్యవస్థ దారుణంగా ఉందని, చూచిరాతలు, స్కాములు, పేపర్ లీక్ లు ఆఖరికి టీచర్లను బదిలీ చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బొత్సా సంచలన వ్యాఖ్యలు…
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం విజయవాడలో 2023-24 విద్యా సంవత్సరానికి ఆర్జీయూకెటిల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల తాత్కాలిక జాబితాని ఆయన విడుదల చేశారు.

ఈ సంధర్బంగా తెలంగణలో ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూలు విడుదల చేశారు, ఏపీలో ఎందుకు విడుదల చెయ్యలేదని విలేకరులు ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన మంత్రి బొత్సా ఏపీ విద్యావ్యవస్థను తెలంగాణతో పోల్చకూడదని స్పష్టం చేశారు. “మాట్లాడితే మీరు (విలేకరులు) ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణతో పోల్చుతారు.

కానీ మనం రోజూ పేపర్లో చూస్తూనే ఉన్నాం టీఎస్ పిఎస్పీ పేపర్ ను సరిగ్గా నిర్వహించలేకపోయారు, అన్నీ చూచిరాతలు…స్కాంలు అందులో ఎంతమంది అరెస్ట్ అయ్యారో చూస్తూనే ఉన్నాం” అని బొత్సా ఎద్దేవా చేశారు.

తెలంగాణ వాళ్ళు కనీసం టీచర్ల బదిలీలు కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నారని బొత్సా తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా విద్యారంగంలో మనమే టాప్ లో ఉన్నామని మీడియాతో చెప్పారు.

విద్యా రంగంలో దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుందని, ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions