Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ లను సీజ్ చేయాలి: బండి

కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ లను సీజ్ చేయాలి: బండి

Congratulations to Bandi Sanjay

‌- బీజేపీ ఎంపీ సంచలన డిమాండ్!

Bandi Sanjay | కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ మేరకు మాట్లాడుతూ..కేసీఆర్ మినహా మిగిలిన ఆయన కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ లు సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే ఓడిపోయిన మాజీ మంత్రుల, ఎమ్మెల్యేల పాస్పోర్ట్ లు కూడా స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు బండి. వారి పాలనలో ప్రజల, ప్రభుత్వ ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు. అలాగే బీఆరెస్ పాలనలో వారి అరాచకాలు వర్ణించలేని విధంగా ఉండేవని పేర్కొన్నారు.

ఇప్పటి ప్రభుత్వం విచారణ ప్రారంభిస్తే బీఆరెస్ నేతలు పారిపోయే ప్రమాదం ఉందని, సీఎం రేవంత్ రెడ్డి వీరి పాస్పోర్ట్ లను స్వాధీనం చేసుకోవాలని కోరారు.

అంతేకాకుండా సీఎంఓ లో పదవి విరమణ పొందిన అధికారులు కూడా పెద్ద ప్రజలను కొల్లగొట్టి అక్రమంగా డబ్బులు సంపాదించారని, అందుకోసం వారి పాస్పోర్ట్ లను కూడా స్వాధీనం చేసుకోవాలని కోరారు బండి సంజయ్.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions