Wednesday 16th April 2025
12:07:03 PM
Home > తాజా > ‘HCU విద్యార్ధులపై కేసులు..డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు’

‘HCU విద్యార్ధులపై కేసులు..డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు’

Bhatti asks police to withdraw cases against HCU students | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల HCU విద్యార్థులు, అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. దింతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

తాజగా హెచ్సీయూ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సోసైటీ గ్రూప్స్ తో సబ్ కమిటీ భేటీ అనంతరం విద్యార్ధులపై నమోదు చేసిన కేసుల్ని ఉపసంహరించుకోవాలని భట్టి స్పష్టం చేశారు. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన కేసును వెంటనే వాపస్ తీసుకోవాలని పేర్కొన్నారు.

కేసుల ఉపసంహరణ సమయంలో ఎలాంటి న్యాయ పరమైన సమస్యలు తలెత్తకుండా పోలీసులకు తగిన సూచనలు చేయాలని న్యాయశాఖ అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు.

You may also like
indiramma indlu
ఇందిరమ్మ ఇండ్లపై తొలి అడుగు.. ఖాతాల్లో రూ. లక్ష జమ!
kotha prabhakar reddy
బీఆరెస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
‘జై శ్రీరామ్ నినాదం..తమిళనాడు గవర్నర్ పై విమర్శలు’
‘వన్యప్రాణులపై కాంగ్రెస్ బుల్డోజర్లు..రేవంత్ సర్కార్ పై మోదీ ఫైర్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions