Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > బండి అధ్యక్షుడిగా ఉంటే వేరేలా ఉండేది..మాజీ ఎంపీ సంచలనం..!|

బండి అధ్యక్షుడిగా ఉంటే వేరేలా ఉండేది..మాజీ ఎంపీ సంచలనం..!|

Bandi Sanjay News| తెలంగాణ ( Telangana ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) మంచి మెజారిటీ తో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, బీజేపీ ( BJP ) నేత ఏపీ జితేందర్ రెడ్డి( A. P. Jithender Reddy ).

ఈ మేరకు సోమవారం నాడు మీడియా ( Media )తో మాట్లాడారు ఆయన. బండి సంజయ్ ( Bandi Sanjay ) అధ్యక్షుడిగా ఉంటే బీజేపీ విజయం సాదించేదని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రజలు బీఆరెస్ ( BRS ) ను ఓడించాలని డిసైడ్ అయ్యారని, ప్రజలు మార్పు కోరుకున్నారని కానీ బీజేపీ లో నెలకొన్న పరిస్థితుల్లో, బండి సంజయ్ ని అధ్యక్షుడిగా మార్చిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ వైపు వెళ్లారని తెలిపారు జితేందర్ రెడ్డి.

రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ఎందుకంటే వారికి కేంద్ర నాయకత్వ సహకారం లేదని పేర్కొన్నారు.

కర్ణాటక ( Karnataka ) లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ చతికిల పడిందని, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేయలేదన్నారు ఈ బీజేపీ నేత.

కాంగ్రెస్ గెలవడం తో రాష్ట్ర మరో 5 సంవత్సరాలు వెనక్కి పోయిందని ధ్వజమెత్తారు.

You may also like
harish rao pressemeet
రైతుల నోట్లో మట్టి కొట్టి.. బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా?
cm revanth about medaram jathara
‘మేడారం తల్లుల స్పూర్తితో ప్రభుత్వం ఏర్పడింది’
generative ai services in hyderabad police
పోలీస్ విధుల కేటాయింపులో ఏఐ వినియోగం!
chiranjeevi
పద్మ అవార్డు గ్రహీతలకు ‘చిరు’ సన్మానం..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions