Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > బండి అధ్యక్షుడిగా ఉంటే వేరేలా ఉండేది..మాజీ ఎంపీ సంచలనం..!|

బండి అధ్యక్షుడిగా ఉంటే వేరేలా ఉండేది..మాజీ ఎంపీ సంచలనం..!|

Bandi Sanjay News| తెలంగాణ ( Telangana ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) మంచి మెజారిటీ తో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, బీజేపీ ( BJP ) నేత ఏపీ జితేందర్ రెడ్డి( A. P. Jithender Reddy ).

ఈ మేరకు సోమవారం నాడు మీడియా ( Media )తో మాట్లాడారు ఆయన. బండి సంజయ్ ( Bandi Sanjay ) అధ్యక్షుడిగా ఉంటే బీజేపీ విజయం సాదించేదని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రజలు బీఆరెస్ ( BRS ) ను ఓడించాలని డిసైడ్ అయ్యారని, ప్రజలు మార్పు కోరుకున్నారని కానీ బీజేపీ లో నెలకొన్న పరిస్థితుల్లో, బండి సంజయ్ ని అధ్యక్షుడిగా మార్చిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ వైపు వెళ్లారని తెలిపారు జితేందర్ రెడ్డి.

రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ఎందుకంటే వారికి కేంద్ర నాయకత్వ సహకారం లేదని పేర్కొన్నారు.

కర్ణాటక ( Karnataka ) లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ చతికిల పడిందని, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేయలేదన్నారు ఈ బీజేపీ నేత.

కాంగ్రెస్ గెలవడం తో రాష్ట్ర మరో 5 సంవత్సరాలు వెనక్కి పోయిందని ధ్వజమెత్తారు.

You may also like
కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’!
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’
KTR press meet
‘ఆరు గ్యారెంటీ ల కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions