Wednesday 14th May 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ బిల్లులన్నీ సొంతడబ్బులతోనే చెల్లించాలి: సీఎం

మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ బిల్లులన్నీ సొంతడబ్బులతోనే చెల్లించాలి: సీఎం

assam cm himantha

CM Himantha | రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు జులై నెల నుండి వారి విద్యుత్ చార్జీలను వారే సొంత డబ్బులతో చెల్లించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు అస్సాం సీఎం హిమాంత బిశ్వాశర్మ.

ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. జులై నుండి తాను, సీఎస్ ఈ నిబంధనను పాటిస్తున్నట్లు పేర్కొన్నారు.

75 ఏళ్లుగా మన దేశంలోని మంత్రుల, ప్రజా ప్రతినిధుల, ప్రభుత్వ ఉన్నతాధికారుల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని, కానీ ఇక నుండి ఈ విఐపి సంస్కృతికి ముగింపు పలుకుతున్నట్లు ఆయన చెప్పారు.

ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనివల్ల విద్యుత్ బోర్డుకు వచ్చే నష్టాలను నివారించవచ్చని, దింతో విద్యుత్ శాఖ కరెంట్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేదని తెలిపారు.

You may also like
indiramma indlu
ఇందిరమ్మ ఇండ్లపై తొలి అడుగు.. ఖాతాల్లో రూ. లక్ష జమ!
dr kavvampally satyanarayana
ఎమ్మెల్యే ఆన్ వీల్స్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం!
manchu vishnu
ఫ్యాన్స్ కి సారీ చెబుతూ మంచు విష్ణు పోస్ట్..!
Ram Charan
రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions