Tuesday 29th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కరెంట్.. ఆనందంలో గ్రామస్తులు!

స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కరెంట్.. ఆనందంలో గ్రామస్తులు!

arla village gets power

Arla Village Gets Power | మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ కరెంటు లేని గ్రామాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఇది నిజం.

ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ పలు మారుమూల గిరిజన గ్రామాల్లో కరెంట్, రోడ్డు, ఆసుపత్రి సౌకర్యాలకు దూరంగా  ఉన్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని ఓ గిరిజన గ్రామంలో స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కరెంట్ వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని అనకాపల్లి జిల్లా రోలుగుంట (మ) అర్ల పంచాయతీలోని నీలబంద గ్రామానికి కరెంటు సదుపాయం వచ్చింది.

మూడు కుటుంబాలకు చెందిన 26 మంది ఆ గ్రామంలో నివసిస్తున్నారు. గ్రామంలో తొలి లైట్ వెలగడంతో గ్రామప్రజలు ఆనందంతో థింసా నృత్యం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

You may also like
‘ఇందిరా గాంధీలా ధైర్యం ఉంటే..ట్రంప్ మాటల్ని ప్రధాని ఖండించాలి’
స్టేడియం పిచ్ క్యూరేటర్-గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం
‘బాధితుల కోసం యాప్..మనం వచ్చాక సినిమా చూపిద్దాం’
‘IND vs PAK మ్యాచ్ చూడడానికి నా మనస్సాక్షి ఒప్పుకోలేదు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions