Amit Shah Participates In Mahakumbh | ప్రయాగ్రాజ్ ( Prayagraj ) లో జరుగుతున్న మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. అలాగే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించేందుకు రాజకీయ ప్రముఖులు సైతం తరలివస్తున్నారు.
సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah ) కుంభమేళాలో పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి గంగ, యమున, సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్యస్నానం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గంగనదికి హారతి ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అమిత్ షా తనయుడు, ఐసీసీ ఛైర్మన్ జై షా ( Jai sha ) కూడా ఉన్నారు. కాగా అమిత్ షా కుంభమేళా పర్యటన సందర్భంగా ఆయనతో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath ), యోగా గురు బాబా రాందేవ్ కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించారు.
ఈ సమయంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. కేంద్రమంత్రి అమిత్ షా త్రివేణి సంగమంలో స్నానమచరిస్తుండగా పక్కనే ఉన్న సీఎం యోగి ఆయనపై నీళ్లు చల్లారు. ఈ క్రమంలో అక్కడ నవ్వులు విరబూశాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది