Thursday 19th September 2024
12:07:03 PM
Home > తాజా > నేడు ఒకే వేదికపై అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్!

నేడు ఒకే వేదికపై అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్!

allu arjun sukumar

Allu Arjun and Sukumar | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), దర్శకుడు సుకుమార్ (Sukumar) బుధవారం సాయంత్రం ఒకే వేదికపై కనిపించనున్నారు.

విలక్షణ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో పీబీఆర్ సినిమాస్ పతాకంపై లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ ఆగస్ట్ 23న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లోని పార్క్ హాయాత్ హోటల్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు అల్లు అర్జుజ్, సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు.

ఇదిలా ఉండగా పుష్ప 2 సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్, సుకుమార్ ల మధ్య విభేదాలు తలెట్టాయని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది.

ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారంపై ఎవరూ స్పందించలేదు. ఈ క్రమంలో నేడు ఒకే వేదికపై సందడి చేయనున్న అల్లు, సుక్కు విభేదాలు అనే ప్రచారంపై ఏ విధంగా స్పందిస్తారో అనేది ఆసక్తిగా మారింది.

You may also like
allu arjun
అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేసిన మెగా హీరో.. సోషల్ మీడియా లో రచ్చ!
Junior artist suicide..
జూనియర్ ఆర్టిస్టు ఆత్మహత్య..

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions