Allu Aravind Donates Film Profits to Indian Army | ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారత సైన్యానికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. శ్రీవిష్ణు, కేతిక శర్మ జంటగా కార్తిక్ రాజు తెరకెక్కించిన సినిమా సింగిల్. శుక్రవారం ఈ సినిమా విడుదల అయ్యింది.
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మూవీ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సింగిల్ మూవీ కలెక్షన్లలో కొంత భాగాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. తాజగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన విషయం తెల్సిందే.
పాక్ దాడులను ఎదురుకుంటూ భారత పౌరుల రక్షణ కోసం భారత సైన్యం వీరోచితంగా పోరాడుతుంది. ఈ నేపథ్యంలో భారత భద్రతా దళాలకు తమ మద్దతు ఉంటుందని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.
సైనికులు దేశం కోసం పోరాడుతుంటే మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం సరికాదని, కేవలం ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలపడానికే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.