Tuesday 10th June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > జగన్ కు అదానీ లంచం..వైసీపీ కీలక వ్యాఖ్యలు

జగన్ కు అదానీ లంచం..వైసీపీ కీలక వ్యాఖ్యలు

Adani Indictment Allegations Against Ys Jagan | సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టు ( Solar Project Contract )ల కోసం లంచం ఇచ్చి లబ్ది పొందారనే అభియోగాలతో గౌతమ్ అదానీ ( Gautam Adani )పై అమెరికా దేశంలో కేసు నమోదైన విషయం తెల్సిందే.

లంచం ఇవ్వడానికి తప్పుడు సమాచారమిచ్చి అమెరికాలో అదాని నిధులు సేకరించారని అభియోగాలు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ పెద్దలకు, అధికారులు అదాని సంస్థ రూ.1750 కోట్ల లంచం ఇచ్చినట్లు చార్జిషీట్ లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ స్పందించింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేంద్రరంగ ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో మాత్రమే ఒప్పందం చేసుకున్నట్లు, అదానీ గ్రూప్ తో ఏపీ డిస్కమ్ లు ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని జగన్ పార్టీ స్పష్టం చేసింది.

తమ పార్టీపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని వైసీపీ ఒక ప్రకటన విడుదల చేసింది.

You may also like
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
ministers
తెలంగాణలో కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే!
TG సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి నెలకు రెండుసార్లు..!
chenab railway bridge
ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions