Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్’

‘అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్’

KCR Attends Telangana Assembly For Budget Session | మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. బుధవారం నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయిన విషయం తెల్సిందే.

తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ( Jishnu Dev Verma ) ప్రసంగించారు. అంతకంటే ముందు నందినగర్ లోని నివాసం నుండి బయలుదేరిన గులాబీ బాస్ అసెంబ్లీ కి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆరెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కేసీఆర్ సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

ఇదిలా ఉండగా గవర్నర్ ప్రసంగంపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గవర్నర్ తో పచ్చి అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లా ఉందని ఎద్దేవా చేశారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions