Friday 11th April 2025
12:07:03 PM
Home > తాజా > రైతు దినోత్సవం నాడే అన్నదాత అవయవదానం..ఐదుగురికి ప్రాణత్యాగం

రైతు దినోత్సవం నాడే అన్నదాత అవయవదానం..ఐదుగురికి ప్రాణత్యాగం

74 Year Old Farmer Save’s Five Peoples Lives By Donating Organs | జాతీయ రైతు దినోత్సవం నాడే ఓ అన్నదాత అవయవదానం చేసి ఐదుగురి ప్రాణాలను కాపాడారు.

ఈ విషయాన్ని తెలంగాణ జీవన్ దాన్ తెలిపింది. మహబూబ్నగర్ జిల్లా అమనగల్ మండలం ముద్విన్ గ్రామానికి చెందిన 74 ఏళ్ల పుట్టి జంగయ్య ఓ రైతు. అయితే డిసెంబర్ 19న అపస్మారక స్థితిలో ఇంట్లో ఒక్కసారిగా పడిపోయారు.

దింతో ఆయన్ను కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే డిసెంబర్ 23న జంగయ్య బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఇదే సమయంలో జీవన్ దాన్ ప్రతినిధులు జంగయ్య కుటుంబ సభ్యులను కలిసి అవయవదానం విశిష్టతను వివరించారు.

ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఈ క్రమంలో జంగయ్య శరీరం నుండి కాలేయం, రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు సేకరించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదుగురికి అమర్చారు.

జంగయ్య అవయవదానం చేసిన సోమవారం నాడే జాతీయ రైతు దినోత్సవం. అవయవదానం చేసి రైతే రాజు అని జంగయ్య నిరూపించారు.

You may also like
cm revanth reddy
Hyd Metro విస్తరణపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!
‘రాజమౌళి పోస్ట్..పర్వతాన్ని క్లీన్ చేశారు’
దేశభక్తికి ప్రతీక ‘జైహింద్’..ఈ నినాదం సృష్టికర్త తెలంగాణ బిడ్డే!
జపనీయులు మన దేశాన్నిఏమని పిలిచేవారో తెలుసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions