Thursday 19th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > నన్ను తిట్టినా కక్ష సాధింపుకు దిగలేదు

నన్ను తిట్టినా కక్ష సాధింపుకు దిగలేదు

Ys Jagan News Today | గుంటూరు ( Guntur ) జిల్లా జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ( Nandigam Suresh ) ను బుధవారం ములాకత్ లో కలిశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ( Ys Jagan ). ఈ సందర్భంగా సురేష్ కు ధైర్యం చెప్పిన జగన్, అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అనంతరం జగన్ మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా, ఇంత దుర్మార్గ పాలన ఆంధ్రాలో ఎప్పూడూ చూడలేదని చెప్పారు. అక్రమ కేసులో ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ) నిర్లక్ష్యంతో విజయవాడ ( Vijayawada )అతలాకుతలం అయ్యిందని, ఆ తప్పుల నుండి ప్రజలను డైవర్ట్ చేయడానికే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.

గతంలో సిట్టింగ్ సీఎంగా ఉన్న తనను ఓ టీడీపీ నేత దారుణంగా దూషించినా బాబులగా కక్ష సాధింపుకు దిగలేదన్నారు.

టీడీపీ ఆఫీస్ పై దాడి జరిపాడని సురేష్ ను అరెస్ట్ చేశారని, కానీ ఆ ఘటనలో సురేష్ ఉన్నాడా ? అని జగన్ ప్రశ్నించారు. సీసీ టీవీ ఫుటేజ్ లో సురేష్ ఎక్కడైనా కనిపించాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని హెచ్చరించారు.

You may also like
జగన్ రెడ్డి ప్యాలెస్ లోనే నటి జత్వాని పై స్కెచ్
ఇది ఏ తరహా పరిపాలనకు నిదర్శనం బాబుగారూ?
‘ జగన్ లాంటి అసమర్థ వ్యక్తి సీఎం ఎలా అయ్యాడు ?’
జగన్ తో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ కు ఛార్జిమెమో

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions