Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > యురేనియం తవ్వకాలు వద్దు..కర్నూల్ జిల్లాలో గ్రామస్థుల పోరుబాట

యురేనియం తవ్వకాలు వద్దు..కర్నూల్ జిల్లాలో గ్రామస్థుల పోరుబాట

Uranium Mining In Andhra Pradesh | పచ్చని పల్లెల్లో యురేనియం ( Uranium ) అగ్గి రాజేసింది. యురేనియం తొవ్వకాలు చేపడితే తమ గ్రామాలు ఉనికి లేకుండా పోతాయని ప్రజలు పోరుబాట పట్టారు.

కర్నూల్ ( Kurnool ) జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాల ( Kappatralla ) గ్రామంతో పాటు మరో 12 గ్రామాల్లో యురేనియం తవ్వకాలతో వణుకు పుట్టింది. అణు విద్యుత్ ఉత్పత్తి చేసే దేశాల సరసన నిలవాలని కేంద్రం భావిస్తుంది.

కప్పట్రాల, నల్ల చెలిమిల, గుండ్లకొండ చెల్లెలి చెలిమిల గ్రామాల పరిధిలో 468 హెక్టార్ల అటవీ భూమి ఉంది. ఇక్కడ యురేనియం నిక్షేపాల కోసం తవ్వకాలు జరిపేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు యురేనియం వద్దే వద్దు అని నినదిస్తున్నారు.

కర్నూల్ బళ్లారి రహదారి ( Highway )పై వేల సంఖ్యలో గ్రామస్థులు బైఠాయించి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు మహిళలు మందు డబ్బలతో, పెట్రోల్ సీసాలతో నిరసన తెలుపుతున్నారు. తవ్వకాలు జరిపితే తమ ఉనికే ప్రశ్నార్ధకం అవుతుందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions