Wednesday 4th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > యురేనియం తవ్వకాలు వద్దు..కర్నూల్ జిల్లాలో గ్రామస్థుల పోరుబాట

యురేనియం తవ్వకాలు వద్దు..కర్నూల్ జిల్లాలో గ్రామస్థుల పోరుబాట

Uranium Mining In Andhra Pradesh | పచ్చని పల్లెల్లో యురేనియం ( Uranium ) అగ్గి రాజేసింది. యురేనియం తొవ్వకాలు చేపడితే తమ గ్రామాలు ఉనికి లేకుండా పోతాయని ప్రజలు పోరుబాట పట్టారు.

కర్నూల్ ( Kurnool ) జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాల ( Kappatralla ) గ్రామంతో పాటు మరో 12 గ్రామాల్లో యురేనియం తవ్వకాలతో వణుకు పుట్టింది. అణు విద్యుత్ ఉత్పత్తి చేసే దేశాల సరసన నిలవాలని కేంద్రం భావిస్తుంది.

కప్పట్రాల, నల్ల చెలిమిల, గుండ్లకొండ చెల్లెలి చెలిమిల గ్రామాల పరిధిలో 468 హెక్టార్ల అటవీ భూమి ఉంది. ఇక్కడ యురేనియం నిక్షేపాల కోసం తవ్వకాలు జరిపేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు యురేనియం వద్దే వద్దు అని నినదిస్తున్నారు.

కర్నూల్ బళ్లారి రహదారి ( Highway )పై వేల సంఖ్యలో గ్రామస్థులు బైఠాయించి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు మహిళలు మందు డబ్బలతో, పెట్రోల్ సీసాలతో నిరసన తెలుపుతున్నారు. తవ్వకాలు జరిపితే తమ ఉనికే ప్రశ్నార్ధకం అవుతుందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions