TSRTC Special Bus: కొంతకాలంగా అద్భుతమైన ఆఫర్లు, కొత్త ప్యాకేజీలతో ప్రయాణీకులను ఆకర్షిస్తున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మరో శుభవార్త చెప్పింది.
భక్తుల సౌకర్యార్థ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 17న అమావాస్య సందర్భంగా కర్ణాటకలోని గానుగాపూర్ (Ganugapur) దత్తాత్రేయ స్వామి ఆలయానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసింది.
ఈ గానుగాపూర్తో పాటు మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్ లకు కూడా ఈ ప్రత్యేక బస్సును సంస్థ నడుపుతోంది.
సర్వీసు నంబరు 92221 గల స్పెషల్ సర్వీస్ జూలై 16న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి గానుగాపూర్కు బయలుదేరుతుంది.
17న ఉదయం దత్తాత్రేయ స్వామి దర్శనానంతం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి మహారాష్ట్రలోని బయలుదేరుతుంది.
సాయంత్రం 4 గంటలకు పండరీపూర్ చేరుకుంటుంది. పాండురంగస్వామి దర్శనానంతరం రాత్రి 10 గంటలకు తుల్జాపూర్కు వెళ్తుంది.
తుల్జా భవాని మాత దర్శనానంతరం 18న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతుంది. రాత్రి 8.30 గంటలకల్లా ఎంజీబీఎస్కు చేరుకుంటుంది.
Read Also: అమెరికాకు కేంద్ర మంత్రి.. కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం!
బస్ టికెట్ ధర ఎంతంటే..
భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ బస్ టికెట్ ధరను రూ.2500గా టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
అయితే ఈ ధరలో కేవలం ప్రయాణ సదుపాయం మాత్రమే సంస్థ కల్పిస్తోంది. దర్శనం, భోజనం, వసతి సదుపాయాల బాధ్యత భక్తులదే.
టికెట్ బుక్ చేసుకోండిలా..
టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ http://tsrtconline.in లో గానుగాపూర్ స్పెషల్ బస్ ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్లలోని కౌంటర్లలో ఈ టికెట్లను పొందవచ్చు.
ఈ ప్రత్యేక బస్సుకు సంబంధించిన పూర్తి వివరాలకు 9440566379, 9959226257, 9959224911 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.