Police Give Warning | సోషల్ మీడియాలో రీల్స్ (Reels)చేసేవారికి తెలంగాణ పోలీసులు (Telangana Police) వార్నింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారి మీద కేసులు పెడతామని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో వీడియోల కోసం సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. రీల్స్ కోసం ప్రజలకు ఇబ్బంది కలిగేలా పిచ్చి చేష్టలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
పబ్లిక్ ప్లేసులో నోట్లు వెదజల్లుతూ న్యూసెన్స్ క్రియేట్ చేసిన మహాదేవ్ అనే యూట్యూబర్ మీద కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
‘యువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేయడాలు… పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివాటిని ఉపేక్షించబోరు. కఠినచట్టాలు ప్రయోగించి జైలుఊచలు లెక్కబెట్టిస్తారు’ అంటూ పోలీసులు హెచ్చరించారు.