Tuesday 15th April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి!

అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి!

telugu people died in usa

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మరణించారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు కారు ప్రమాదం జరిగింది.  

వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా బక్రి చెప్యాల చెందిన రోహిత్ రెడ్డి, భార్య ప్రగతి రెడ్డి, ఇద్దరు కుమారులు, తల్లి సునీతతో అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసం ఉంటున్నారు. రోహిత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోహిత్ రెడ్డి భార్య ప్రగతి రెడ్డి, పెద్దకుమారుడు అర్విన్, తల్లి సునీత అక్కడికక్కడే మృతిచెందారు.

రోహిత్ రెడ్డి, చిన్నకుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో రోహిత్ కారు నడిపారు. ఈ ప్రమాదంతో ప్రగతి రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సమాచారం తెలిసిన వెంటనే ప్రగతి రెడ్డి తల్లిదండ్రులు మోహన్ రెడ్డి, పవిత్రాదేవి అమెరికాకు బయల్దేరారు. మృతులకు ఫ్లోరిడాలోనే దహన సంస్కారాలు చేస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

You may also like
telangana high court
దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కుమారుడికి గాయాలు!
Ram Charan
రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్!
cm revanth
బెట్టింగ్ యాప్ లపై సీఎం రేవంత్ కీలక ప్రకటన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions