Wednesday 18th March 2026
12:07:03 PM
Home > తాజా > నూతన రాజకీయ పార్టీని స్థాపించిన తీన్మార్ మల్లన్న

నూతన రాజకీయ పార్టీని స్థాపించిన తీన్మార్ మల్లన్న

Teenmaar Mallanna New Political Party News | శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా బీసీ వాదాన్ని వినిపిస్తున్న తీన్మార్ మల్లన్న బుధవారం నాడు ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన పార్టీ పేరును ప్రకటించారు. బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందన్న ఉద్దేశ్యంతోనే ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. సెప్టెంబర్ 17 బీసీల తలరాత మారే దినంగా తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇకపోతే పార్టీ జెండాను ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులలో ఉంది. జెండా మధ్యలో పిడికిలి, కార్మిక చక్రం మరియు వరి కంకులు ఉన్నాయి. జెండా పైభాగంలో ఆత్మగౌరవం, అధికారం మరియు వాటా అనే నినాదాలు ప్రస్తావించబడ్డాయి.

అదేవిధంగా, పార్టీ పేరును పిడికిలి దిగువన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పేర్కొన్నారు. పార్టీ జెండాను బిసి మేధావి నారా గోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లన్న ఆకుపచ్చ రంగు అంటే రైతులు, ఎరుపు రంగు అంటే పోరాటం అని ప్రకటించారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions