Friday 18th October 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. రికార్డ్ ధరకు సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్!

ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. రికార్డ్ ధరకు సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్!

nithish kumar reddy in apl

Andhra Premier League | ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (APA) ఆధ్వర్యంలో ఏటా టి20 (T20) ఫార్మాట్ లో ‘ ఆంధ్రా ప్రీమియర్  లీగ్ ‘ (Andhra Premier League) జరుగుతున్న విషయం తెల్సిందే. రెండేళ్ల కిందట ఇది (APL) ప్రారంభం అయ్యింది. ఈ టోర్నీలో మొత్తం ఆరు టీంలు పోటీ పడతాయి.

తాజాగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఆక్షన్ లో రికార్డు సృష్టించారు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ ప్లేయర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (Nithish Kumar Reddy).

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ టోర్నీ కోసం గురువారం బిడ్డింగ్ ను నిర్వహించారు. ఇందులో నితీష్ కుమార్ రెడ్డి ఏకంగా రూ.15 లక్షల 60 వేల ధరకు అమ్ముడుపోయారు. ఈ స్టార్ ప్లేయర్ ను గోదావరి టైటాన్స్ (Godavari Titans) కొనుగోలు చేసింది.

ఆంధ్రా లీగ్ లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నితీష్ చరిత్ర సృష్టించారు. గతంలో హనుమ విహారి అత్యధికంగా రూ.6.60 వేల కు సోల్డ్ అయ్యారు. 

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL-2024)లో భాగంగా హైదరాబాద్ తరఫున ఆడుతున్న నితీష్, అల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు.

You may also like
నేటి నుంచి ‘పల్లె పండుగ’..సంక్రాంతి వరకు పనులు పూర్తి!
తెలంగాణలో దంగల్ సినిమా రిపీట్..తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు
దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన రతన్ టాటా అస్తమయం
ఆ దర్శకుడు హీరోయిన్ ను గర్భవతి చేశాడు.. బాంబ్ పేల్చిన పూనమ్ కౌర్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions