Thursday 19th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వరద బాధితులకు స్కూలు విద్యార్థుల విరాళం!

వరద బాధితులకు స్కూలు విద్యార్థుల విరాళం!

children

School Children Donation | ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ వరద బాధితుల సహాయార్థం స్కూలు చిన్నారులు తమ వంతుగా సాయం అందించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని పడమర విప్పర్రులో ఓ స్కూల్ విద్యార్థులు తమ పాకెట్ మనీని విజయవాడ వరద బాధితులకు విరాళం అందించి తమ మంచి మనసు చాటుకున్నారు. చిన్నారులు డబ్బులు ఇస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ వీడియో తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు.

విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం, అవసరమైన వారి పట్ల శ్రద్ధ వహించడం లాంటి వాటిని బోధించడం పట్ల స్కూల్ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను.

ఇటువంటి సంఘటనలు మానవత్వంపై మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయి. దయగల మరియు బాధ్యతగల పౌరుల నాయకత్వంలో మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి.” అని చంద్రబాబు పేర్కొన్నారు

You may also like
Liquor Policy
మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం!
Kumari Aunty meets cm revanth
సీఎం సహాయ నిధికి కుమారి ఆంటీ విరాళం.. ఎంతంటే!
telangana high court
‘బీఆర్ఎస్ ఆఫీస్ ను కూల్చేయండి’.. హైకోర్టు కీలక ఆదేశాలు!
Muslim Family
గణేశ్ లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు.. కేటీఆర్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions