School Children Donation | ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ వరద బాధితుల సహాయార్థం స్కూలు చిన్నారులు తమ వంతుగా సాయం అందించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని పడమర విప్పర్రులో ఓ స్కూల్ విద్యార్థులు తమ పాకెట్ మనీని విజయవాడ వరద బాధితులకు విరాళం అందించి తమ మంచి మనసు చాటుకున్నారు. చిన్నారులు డబ్బులు ఇస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ వీడియో తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు.
విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం, అవసరమైన వారి పట్ల శ్రద్ధ వహించడం లాంటి వాటిని బోధించడం పట్ల స్కూల్ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను.
ఇటువంటి సంఘటనలు మానవత్వంపై మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయి. దయగల మరియు బాధ్యతగల పౌరుల నాయకత్వంలో మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి.” అని చంద్రబాబు పేర్కొన్నారు