Thursday 3rd July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వరద బాధితులకు స్కూలు విద్యార్థుల విరాళం!

వరద బాధితులకు స్కూలు విద్యార్థుల విరాళం!

children

School Children Donation | ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ వరద బాధితుల సహాయార్థం స్కూలు చిన్నారులు తమ వంతుగా సాయం అందించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని పడమర విప్పర్రులో ఓ స్కూల్ విద్యార్థులు తమ పాకెట్ మనీని విజయవాడ వరద బాధితులకు విరాళం అందించి తమ మంచి మనసు చాటుకున్నారు. చిన్నారులు డబ్బులు ఇస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ వీడియో తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు.

విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం, అవసరమైన వారి పట్ల శ్రద్ధ వహించడం లాంటి వాటిని బోధించడం పట్ల స్కూల్ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను.

ఇటువంటి సంఘటనలు మానవత్వంపై మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయి. దయగల మరియు బాధ్యతగల పౌరుల నాయకత్వంలో మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి.” అని చంద్రబాబు పేర్కొన్నారు

You may also like
Supreme Court Of India
అలాంటి సందర్భాల్లో బీమా చెల్లించాల్సిన అవసరం లేదు: సుప్రీం కోర్టు
kavitha pressmeet
BJP అధ్యక్షుడి హోదాలో తొలి విజయం సాధించండి: ఎమ్మెల్సీ కవిత!
bombay high court
“ఐ లవ్ యూ చెప్పడం నేరం కాదు..” బాంబే హైకోర్టు!
ENG vs IND రెండో టెస్టు..స్లిప్స్ లో జైస్వాల్ ఉండడు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions