Thursday 26th June 2025
12:07:03 PM
Home > తాజా > రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు జమ!

రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు జమ!

acb telangana

Rythu Bharosa Scheme | తెలంగాణలోని రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంట పెట్టుబడి కోసం అందించే రైతు భరోసా పథకం కింద ఆర్థిక సహాయం సోమవారం నుంచే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఎకరాలతో సంబంధం లేకుండా అర్హులైన రైతులందరి ఖాతాల్లో ఎకరానికి ఒక్క సీజన్‌కు రూ.6 వేల చొప్పున నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన రైతులందరికీ ఏడాదికి ఎకరానికి రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుంది.

ఈ మొత్తాన్ని ఖరీఫ్ (వానాకాలం) , రబీ (యాసంగి) సీజన్లకు గాను ఒక్కో విడతలో రూ.6,000 చొప్పున పంపిణీ చేస్తారు. ధరణి పోర్టల్‌లో నమోదైన భూమి కలిగిన పట్టాదారులు, అటవీ హక్కుల గుర్తింపు (RoFR) పట్టాదారులు కూడా ‘రైతు భరోసా’కు అర్హులు. ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.

You may also like
‘బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించండి’
జంపన్న వాగు అభివృద్ధికి రూ.5 కోట్లు
‘కేసీఆర్, జగన్ కలిసి..నేనూ ఫోన్ ట్యాపింగ్ బాధితురాలినే’
tgsrtc
తెలంగాణ ఆర్టీసీ ఎన్ని కోట్ల ఉచిత టికెట్లు ఇచ్చిందో తెలుసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions