Tuesday 24th June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అంబేడ్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగింపు..అసెంబ్లీలో రచ్చ

అంబేడ్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగింపు..అసెంబ్లీలో రచ్చ

Ruckus Outside Delhi Assembly Over Baba Saheb Row | ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.

అనంతరం రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సీఎం కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, భగత్ సింగ్ ఫోటోలను తొలగించారని ప్రతిపక్ష ఆప్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.

అంబేడ్కర్ ఫోటో స్థానంలో ప్రధాని మోదీ ఫోటోను పెట్టారని మాజీ ముఖ్యమంత్రి అతిశీ నిప్పులుచేరిగారు. మంగళవారం ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సమయంలో ఆప్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.

ఈ క్రమంలో స్పీకర్ విజేందర్ గుప్తా ఆప్ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సభ నుండి సస్పెండ్ చేశారు. అలాగే మద్యం విధానం పై కాగ్ నివేదిక పట్ల కూడా అధికార బీజేపీ, ప్రతిపక్ష ఆప్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది.

You may also like
అత్తాపూర్ ఘటన..ఆర్టీసీ డ్రైవర్ కు సజ్జనర్ పరామర్శ
‘సోమర్ సాల్ట్ వేసేయ్..పంత్ కు గావస్కర్ రిక్వెస్ట్’
‘ఇజ్రాయిల్ కూడా రష్యన్ మాట్లాడే దేశమే’..పుతిన్ కీలక వ్యాఖ్యలు
టెస్టుల్లో 150 క్యాచులు..పంత్ పేరిట మరో రికార్డు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions