Friday 20th June 2025
12:07:03 PM
Home > తాజా > లేదంటే ముక్కు నేలకు రాయాలి..సవాల్ కు సిద్ధమా: రేవంత్ రెడ్డి..!

లేదంటే ముక్కు నేలకు రాయాలి..సవాల్ కు సిద్ధమా: రేవంత్ రెడ్డి..!

Revanth Reddy Challenges Kcr| ఎన్నికల ప్రచారం లో భాగంగా అధికార బీఆరెస్ ( Brs ) మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ ( Congress ) ల మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.

ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ ( TPCC Chief ) రేవంత్ రెడ్డి కేంద్రంగా బీఆరెస్ నేతలు, ఎంఐఎం ( Aimim ) నేతలు విరుచుకుపడుతున్నారు. వారి విమర్శలకు ఘాటుగా బదులిస్తున్నారు రేవంత్ రెడ్డి. తాజగా బీఆరెస్ అధినేత కేసీఆర్ కు మరో సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్.

ఈ మేరకు కామారెడ్డి ( Kamareddy ) నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ( Shabbir Ali ). ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్..తెలంగాణలో గత ఆరు నెలలుగా రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చుoటే కేసీఆర్ ( Kcr ) నిరూపించాలని సవాల్ విసిరారు.

Revanth Challenge On 24 Hour Free Power| ఈ అంశం పై కామారెడ్డి చౌరస్తా లో చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు.

24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను పోటీ చేస్తున్న కొడంగల్ ( Kodangal ) మరియు కామారెడ్డి స్థానాల నుండి నామినేషన్ ను ఉపసంహరించుకుంటా అంటూ స్పష్టం చేశారు ఆయన. సబ్ స్టేషన్స్ ( Sub Stations ) లాగ్ బుక్స్ తీసుకొని కామారెడ్డి కి రావాల్సిందిగా డిమాండ్ ( Demand ) చేశారు.

బుధవారం సాయంత్రం 3 గంటకు వరకు నామినేషన్ ఉపసంహరణ కు సమయం ఉందని, 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నామినేషన్ ను విత్ డ్రా ( Withdrawn ) చేసుకుంటానని పేర్కొన్నారు రేవంత్.

ఒకవేళ నిరూపించలేని పక్షాన కామారెడ్డి ప్రజల సాక్షిగా ముక్కు నేలకు రాయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షులు.

You may also like
‘బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించండి’
జంపన్న వాగు అభివృద్ధికి రూ.5 కోట్లు
‘కేసీఆర్, జగన్ కలిసి..నేనూ ఫోన్ ట్యాపింగ్ బాధితురాలినే’
acb telangana
రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు జమ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions