Republic Day Parade – 2025 | యావత్ దేశం గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది. ఇందులో భాగంగ దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్యపథ్ లో జరిగిన గణతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ( Droupadi Murmu ) జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ( Prabowo Subianto ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి సైనిక బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ), ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ( Jagdeep Dhankhar ) మరియు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర శాఖలకు సంబంధించిన 31 శకటాలను ప్రదర్శించారు.
రాష్ట్రపతి భవన్ నుండి ఎర్రకోట వరకు సుమారు 9 కి.మీ. మేర రిపబ్లిక్ డే పరేడ్ ను ఏర్పాటు చేశారు. కర్తవ్య పథ్ పై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. త్రివిధ దళాలు సంయుక్తంగా శకటాన్ని తీసుకురావడం ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.