Tuesday 17th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రూ.18 కోట్ల లోన్..కాంగ్రెస్ పై హీరోయిన్ ఫైర్

రూ.18 కోట్ల లోన్..కాంగ్రెస్ పై హీరోయిన్ ఫైర్

Preity Zinta, Congress clash on social media | కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు నటి, ఐపీఎల్ ( IPL ) లో పంజాబ్ టీం సహా యజమాని ప్రీతి జింటా.

ప్రీతి జింటా తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించినందుకు గాను న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ లో నటి తీసుకున్న రూ.18 కోట్ల లోన్ ను మాఫీ చేశారని ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేసిన కేరళ కాంగ్రెస్. గత వారం కో ఆపరేటివ్ బ్యాంక్ మూతపడడంతో డిపాజిటర్లు రోడ్డున పడ్డారని కేరళ కాంగ్రెస్ ( Kerala Congress ) పేర్కొంది.

ఈ నేపథ్యంలో ప్రీతి జింటా స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాలను తానే నిర్వహిస్తామని, వాటిని బీజేపీకి అప్పగించినట్లు కాంగ్రెస్ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. తన లోన్ ను ఎవరూ మాఫీ చేయలేదని ఇలాంటి ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బ్యాంక్ నుండి తీసుకున్న లోన్ ను 10 సంవత్సరాల క్రితమే తీర్చేసినట్లు స్పష్టం చేశారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions