PM Modi Visits Adampur Air Base | ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. మంగళవారం ఎయిర్ బేస్ కు చేరుకున్న ప్రధాని అక్కడ సైనికులతో ముచ్చటించారు.
ఆపరేషన్ సింధూర్, భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశం “ఆపరేషన్ సిందూర్” చేపట్టిన తర్వాత మే 9 మరియు 10 తేదీల మధ్య అర్ధరాత్రి సమయంలో పాకిస్తాన్ దాడి చేయడానికి ప్రయత్నించిన ఎయిర్ బేస్ లో ఆదంపూర్ కూడా ఒకటి.
JF-17 ఫైటర్ జెట్ల నుండి ప్రయోగించిన హైపర్సోనిక్ క్షిపణులు ఆదంపూర్లోని భారతదేశ S-400 వైమానిక రక్షణ వ్యవస్థను నాశనం చేశాయని పాకిస్తాన్ పేర్కొంది. ఈ ఆరోపణను భారత అధికారులు తిరస్కరించిన విషయం తెల్సిందే. మంగళవారం ఉదయం అదాంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించిన సందర్భంగా ధైర్యవంతులైన వైమానిక యోధులు మరియు సైనికులను కలిసినట్లు ప్రధాని తెలిపారు.
ధైర్యం, దృఢ సంకల్పం మరియు ధైర్యానికి ప్రతిరూపంగా నిలిచే వారిని కలవడం ప్రత్యేకమైన అనుభవమని పేర్కొన్నారు. దేశం కోసం మన సాయుధ దళాలు చేస్తున్న కృషికి భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుందన్నారు.