Friday 30th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పాస్టర్ మరణం..విచారణకు సీఎం ఆదేశం

పాస్టర్ మరణం..విచారణకు సీఎం ఆదేశం

Pastor Praveen Pagadala Death | రాజమండ్రి శివారులో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కానీ పాస్టర్ మృతిపై క్రిస్టియన్ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాలు రాజమండ్రి జీజీహెచ్ ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పాస్టర్ మృతిపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు.

ఈ మేరకు రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు. అలాగే వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. రాజమండ్రి వద్ద కొంతమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతిచెందారని రాజానగరం సీఐ మీడియాకు తెలిపారు.

హైదరాబాద్ నుండి బుల్లెట్ పై సోమవారం బయలుదేరిన పాస్టర్ అర్ధరాత్రి కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారని పేర్కొన్నారు. పాస్టర్ హైవే కిందకు పడిపోగా, ఆయన పై బైక్ పడిపోవడంతో తీవ్ర గాయాలు అయినట్లు వివరించారు.

You may also like
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions