Tuesday 24th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు’

‘శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు’

One More Food Item In Tirumala Annaprasadam | తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ( B R Naidu ) వెల్లడించారు.

ఈ మేరకు మెనూ ( Menu )లో ఒక ఐటమ్ పెంచాలని టీటీడీ ఛైర్మన్ అధికారులను అదేశించారు. ఈ క్రమంలో మెనూలో మార్పులు చేస్తూ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు.

ట్రయల్ రన్ ( Trail Run ) లో భాగంగా సోమవారం 5వేల మసాలా వడలను సిబ్బంది భక్తులకు వడ్డించారు.ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా మసాలా వడలు తయారు చేశారు. మసాలా వడలు రుచికరంగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు బీఆర్ నాయుడు తెలిపారు.

పరిశీలనలో లోటుపాట్లను సరిచేసుకొని పూర్తిస్థాయిలో మెనూలో మార్పులు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

You may also like
అత్తాపూర్ ఘటన..ఆర్టీసీ డ్రైవర్ కు సజ్జనర్ పరామర్శ
‘సోమర్ సాల్ట్ వేసేయ్..పంత్ కు గావస్కర్ రిక్వెస్ట్’
‘ఇజ్రాయిల్ కూడా రష్యన్ మాట్లాడే దేశమే’..పుతిన్ కీలక వ్యాఖ్యలు
టెస్టుల్లో 150 క్యాచులు..పంత్ పేరిట మరో రికార్డు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions