Monday 12th January 2026
12:07:03 PM
Home > తాజా > హైదరాబాద్ లో ప్రముఖ ఆలయానికి నీతా అంబానీ రూ. కోటి విరాళం!

హైదరాబాద్ లో ప్రముఖ ఆలయానికి నీతా అంబానీ రూ. కోటి విరాళం!

nita ambani


Nitha Ambani Donates | రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ (Nitha Ambani) తెలంగాణలోని బల్కంపేట ఎల్లమ్మ (Balkampet Yellamma Temple) ఆలయానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని బుధవారం ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తన తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతతో కలిసి ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి కృష్ణ ఆలయ విశిష్టతను నీతా అంబానికి వివరించి, ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

దీంతో నీతా అంబానీ ఆలయానికి కోటి రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేసి, దాని ద్వారా వచ్చే వడ్డీతో రోజూ అన్నదానం కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ మహేందర్ గౌడ్ తెలిపారు. కాగా, జూలై 1 నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కల్యాణ మహోత్సవం జరుగనుంది.

You may also like
United In Triumph
అంధ మహిళల క్రికెట్ జట్టుకు రిలయన్స్ భారీ నజరానా!
yoga day
ఎల్బీ స్టేడియంలో యోగా డే కౌంట్ డౌన్ వేడుకలు!
hydraa
నగరంలో మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు.. ఎక్కడంటే!
delivery boy
డెలివరీ చేయాల్సిన ల్యాప్ టాప్ ను దొంగిలించి రూ.15 వేలు డిమాండ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions