Nara Lokesh News Latest | కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన ఆశ్రమ అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేశారు.
ఈ ఘటన పట్ల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. అన్నదాన సత్రాన్ని కూల్చేయడం బాధాకరమని పేర్కొన్నారు. అటవీ నిబంధనలు ఉన్నా, భక్తుల మనోభావాలు గౌరవించి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకొనున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తానని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.