Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > నమస్తే మంత్రిగారు..మల్లారెడ్డి-వివేక్ మధ్య సంభాషణ

నమస్తే మంత్రిగారు..మల్లారెడ్డి-వివేక్ మధ్య సంభాషణ

Mallareddy-Vivek’s Interesting Conversation In Assembly | తెలంగాణ శాసనసభ లాబీలో మాజీ మంత్రి, బీఆరెస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.

లాబీలో ఎదురుపడ్డ వివేక్ ను నమస్తే మంత్రిగారు అంటూ మల్లారెడ్డి పలకరించారు. దింతో ధన్యవాదాలు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ బదులిచ్చారు.

మొత్తానికి సాధించారు..సీఎం, డిప్యూటీ సీఎం కంటే ముందే ఢిల్లీ వెళ్లిచ్చారు అని మల్లారెడ్డి అనగా, వేరే పనిమీద ఢిల్లీ వెళ్లినట్లు వివేక్ సమాధానం చెప్పారు. రాష్ట్రంలో కోమటిరెడ్డి, వెంకటస్వామి కుటుంబాలదే హవా నడుస్తోందని మల్లారెడ్డి అన్నారు.

దీనిపై గతంలో కేసీఆర్,మల్లారెడ్డి కుటుంబాలదే హవా నడిచేది అని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మాదేం లేదు అని మల్లారెడ్డి చెప్పగా ఇరువురు నేతలు నవ్వుతూ వెళ్లిపోయారు.

You may also like
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions