Monday 16th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కుంభమేళా ఆరంభం..త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు

కుంభమేళా ఆరంభం..త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు

Mahakumbh 2025 News | ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజామున నుండి ఘనంగా ఆరంభమయ్యింది.

యూపీ ( Uttar Pradesh ) ప్రయాగ్ రాజ్ ( Prayagraj )లోని గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్దకు భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకే సుమారు 35 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు.

మొత్తంగా 45 రోజుల పాటు సాగే మహా కుంభమేళాకు 35 కోట్ల మంది భక్తులు హాజరవుతారని యూపీ సర్కారు అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. కేవలం మన దేశం నుండే కాకుండా ప్రపంచ దేశాల నుండి పర్యాటకులు రానున్నారు.

భక్తుల మెరుగైన సౌకర్యాలు, భద్రత కల్పించేందుకు నదిలో తేలియాడే పోలీసు స్టేషన్, చిన్న చిన్న పడవల్లో సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions