Lady Constable Selfie With Ys Jagan | మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( Ys Jagan ) తో సెల్ఫీ ( Selfie ) దిగిన లేడీ కానిస్టేబుల్ కు ఛార్జిమెమో ఇవ్వనున్నట్లు జైలర్ రవిబాబు ప్రకటించారు.
గుంటూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను జగన్ ములాఖత్ లో బుధవారం కలిశారు. అనంతరం జైలు బయట మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జైలులో విధులు నిర్వహించే కానిస్టేబుల్ ఆయేషాబాను ఆమె కూతురితో కలిసి జగన్ తో సెల్ఫీ దిగారు. ఈ నేపథ్యంలో విధి నిర్వహణ సమయంలో ఇలా చేయడం పై విమర్శలు వచ్చాయి.
దింతో ఆమెకి ఛార్జిమెమో ఇస్తామని, ఆమె వివరణ తర్వాత విచారణకి కమిటీ వేస్తామని జైలర్ రవిబాబు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ స్పందించింది. జగన్ తో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని విమర్శించింది. ఉద్యోగులను వేధించడంలో ఇదేం రాక్షసానందం అంటూ సీఎం , హోంమంత్రి అనితను వైసీపీ ప్రశ్నించింది.